టాలీవుడ్ స్టార్ హీరో మహేష్  బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అయితే తాజాగా ఇప్పుడు మహేష్  హీరోగా మరియు  త్రివిక్రమ్‌ డైరెక్షన్‌ లో ఒక సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరి కంబోలో రాబోతున్న మూవీలో ఓ కీలకపాత్ర కోసం హీరోని వెతుకుతున్నారంటూ కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తూనే ఉంది.ఇక ఆ రోల్ కి మాజీ లవర్ బాయ్ తరుణ్ ఫిక్సయ్యాడనేది లేటెస్ట్ న్యూస్. అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ థింగ్ ఏంటంటే.. తరుణ్ హీరోగా నటించిన ‘నువ్వే నువ్వే’తోనే మాటల మాంత్రికుడు దర్శకుడిగా మారాడు, డెబ్యూమూవీతోనే డైరెక్టర్‌ గా తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. 

ఇకపోతే ఇప్పుడు ఇన్నాళ్లకి మళ్లీ తరుణ్‌ అండ్ త్రివిక్రమ్ కలిసి వర్క్ చేయబోతున్నారన్న టాక్ రావడంతో ఫ్యాన్స్‌ ఎగ్జయిట్ గా ఉన్నారు.అయితే మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర మరీ రికార్డులు బ్రేక్‌ చేయకపోయినా వాటికంటూ సపరేట్ కల్ట్ ఫ్యాన్‌ బేస్‌ ని క్రియేట్‌ చేసుకున్నాయి.కాగా  ఖలేజా ఫ్లాప్ తర్వాత ఇద్దరూ కలిసి యాడ్స్‌ ప్రాజెక్ట్స్‌ కి వర్క్‌ చేసినా సినిమా మాత్రం చేయలేదు. ఇకపోతే మొత్తానికి పదకొండు సంవత్సరాల తర్వాత వీళ్ల కాంబోలో మూవీ వస్తుండడంతో ఇద్దరి ఫ్యాన్స్‌ తెగ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అయితే హారిక హాసిని బ్యానర్లో తెరకెక్కనున్న ఈసినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. 

ఇక మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పోకిరి రిలీజ్ డేట్ నే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుండడం విశేషం. ఈ మూవీలో తరుణ్ రోల్ ఎలా ఉండబోతోంది? అయితే ఒకప్పటి లవర్ బాయ్ ఈ ప్రాజెక్ట్‌ లో ఎలా కనిపిస్తాడనే అంచనాలకు త్రివిక్‌ తన మ్యాజిక్‌ తో ఎలాంటి ఆన్సరిస్తాడో చూడాలి.ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ కనిపిస్తోంది. ఇక సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా మరో హీరోయిన్ కోసం త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే శ్రీ లీల, సంయుక్త మీనన్ పేర్లు వినిపించగా.. ఇప్పుడు వరకు రెండో హీరో హీరోయిన్ పై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు!!

మరింత సమాచారం తెలుసుకోండి: