లైగర్ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడానికి హీరోయిన్ కూడా ఒక కారణమనే విషయం తెలిసిందే. లైగర్ సినిమాకు అనన్య పాండే మైనస్ అని క్రిటిక్స్ తో పాటు సాధారణ అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అనన్య పాండే నటన గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పూరీ జగన్నాథ్ అనన్యను ఎలా ఎంపిక చేశారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.


అనన్య పాండే కంటే టాలీవుడ్ హీరోయిన్ అనన్య నగళ్ల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని, యాక్ట్ చేస్తుందని ఆమె నటించినా ఈ సినిమా ఫలితం మరింత మెరుగ్గా ఉండేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారని ఈ హీరోయిన్ల పారితోషికం కూడా తక్కువేనని పూరీ జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్లు ఈ హీరోయిన్లపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లు తెలుగమ్మాయిలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని మరి కొందరు కూడా కామెంట్లు చేస్తున్నారు.


 


మరోవైపు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారని సమాచారం అందుతోంది. లైగర్ రిజల్ట్ వల్ల పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జనగణమన సినిమాపై ఊహించని స్థాయిలో ప్రభావం పడుతోంది. జనగణమన సినిమా సెట్స్ పైకి వెళుతుందో లేదో మరీ  చూడాలి.విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం పూరీ జగన్నాథ్ విషయంలో సీరియస్ గా ఉన్నారు.


 


విజయ్ తో జనగణమన సినిమాను తెరకెక్కించి ఆ సినిమా కూడా అంచనాలను అందుకోకపోతే పూరీ జగన్నాథ్ కు కొత్త ఆఫర్లు రావడం కష్టమని  తెలుస్తుంది.. పూరీ జగన్నాథ్ ను నమ్మి విజయ్ దేవరకొండ మోసపోయారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లైగర్ రిజల్ట్ విషయంలో పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్  కూడా బాగా ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: