టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగా వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు . ఈ మూవీ ని సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ లను మొదలు పెట్టింది. 

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పార్క్ హయత్ ,  హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు , ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం  విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: