తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా తన మూడవ సినిమాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటించగా ఈ మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్  2 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా హీరో వైష్ణవ్ తేజ్ ,  ఈ సినిమా హీరోయిన్ కేతికా శర్మ ,  ఈ మూవీ దర్శకుడు గిరిశయ్య  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా వైష్ణవ్ తేజ్ కి మల్టీ స్టార్ మూవీ ఎవరితో చేయడానికి ఇష్టపడతావు ... అనే ప్రశ్న ఎదురయింది.  ఈ ప్రశ్నకు వైష్ణవ్ తేజ్ సమాధానం ఇస్తూ ...  మల్టీ స్టార్ మూవీ లో నేను ఒక నటుడిగా నటించాలి అని అనుకోవడం లేదు. మల్టీస్టారర్ మూవీ కి దర్శకత్వం వహించాలి అని అనుకుంటున్నాను. మా అన్నయ్య సాయితేజ్ మరియు  మా బావ వరుణ్ తేజ్ తో  మల్టీ స్టారర్ మూవీ చేయాలనుంది.

ఆల్రెడీ కథను కూడా సిద్ధం చేసుకున్నాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా వైష్ణవ్ తేజ్ చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ రోజు అనగా ఆగస్టు 30 వ తేదీన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం భారీగా నిర్వహించనుంది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. రంగ రంగ వైభవంగా మూవీ ఏ రేంజ్ విజయ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: