టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. అయితే మరి అలాంటి డైరెక్టర్లలో విక్రమ్ కే కుమార్ ఒకరు అన్న సంగతి అందరికీ తెలిసిందే..ఈయన తీసిన సినిమాలన్నీ ఒక క్లాసిక్ సినిమాలుగా మిగిలి పోయాయి..అయితే ఒక మనం.. ఒక 24 సినిమా.. ఇలా ఈయన సినిమాలో కథాంశం ను మలచిన తీరు ప్రేక్షకులను ఆకట్టు కుంది.  చైతూ తో తీసిన థాంక్యూ సినిమా మాత్రం ఫుల్ అపోజిట్ ఉంది.కాగా మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూకు ఇప్పుడు థాంక్యూ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంత అంటే నాగ చైతన్య పై వరుస నెగిటివ్ కామెంట్స్ సైతం వచ్చాయి.

ఇక  థాంక్యు సినిమా ఇంట మాత్రమే కాదు బయట కూడా కలెక్షన్స్ రాబట్టలేక పోయింది. ఇకపోతే  ఆ తర్వాత చైతూ బాలీవుడ్ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చడ్డా కూడా ఘోర పరాజయం పొందింది..ఇక ఇలాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత చైతూ నెక్స్ట్ సినిమాపై మరింత టెన్షన్ నెలకొంది. అయితే ఈయన ప్రెజెంట్ చేస్తున్న బైలింగ్వన్ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నాడు. తమిళ్ డైరెక్టర్ తో చైతూ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.. వెంకట్ ప్రభు తో నెక్స్ట్ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.అంతేకాదు ఇది తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. 

కాగా వరుస ప్లాపులు అందుకున్న చైతూ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.. ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఇందులో మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటించ బోతుంది.అయితే  ఈమెకు కూడా ఈ సినిమా కీలకమే.. ఇకపోతే  యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5 నుండి రెగ్యురల్ షూటింగ్ జరుపుకోనుంది.ఇక ఈ సినిమాతో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతు నటిస్తున్న దూత వెబ్ సిరీస్ షూటింగ్ దశలో ఉంది ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల మంచి అంచనాలు ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: