ప్రభాస్ హీరో గా నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాదికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా యొక్క చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది సినిమా. గ్రాఫిక్స్ భారీ గా యూజ్ చేసిన ఈ సినిమా కోసం ఇన్ని రోజులు ఆ పనులను చేశారంటే ఏ స్థాయి లో ఈ సినిమా కి గ్రాఫిక్స్ వాడారో అర్థం అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందించగా ఇందులో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండడం విశేషం.

మరి ఇన్ని విశేషాలు కలిగిన ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కేవలం ఒకటి రెండు అప్డేట్ లతోనే సరిపెట్టింది చిత్ర బృందం. మెయిన్ ఆర్టిస్ట్ ల పుట్టిన రోజును కూడా పట్టించుకోలేదు. అలా ఆది పురుష్ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినా వారి సహనాన్ని పరీక్షిస్తూ సినిమా యొక్క అప్డేట్ ను ఇప్పటిదాకా వదల్లేదు. అభిమానులు వేచి చూడడం వెనుక ఎంతటి ఆసక్తి కలిగి ఉందొ అర్థం చేసుకోవచ్చు.

ప్రభాస్ అభిమానులు ఎంతవరకు ఓపికతో ఉండాలో అంతే ఉంటారు. లేదంటే వెంటనే సోషల్ మీడియా లో సదరు సినిమా సంస్థ ను ట్రోల్ చేస్తారు ప్రభాస్ అభిమానులు.  మరి తొందరలో ఈ సినిమా అప్డేట్ కూడా రాకపోతే ఇదే పని చేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. వాస్తవానికి గతంలో రాధే శ్యామ్ సినిమా విషయంలో అభిమానులు ఇదే విధంగా ట్రోల్ చేస్తే కానీ ఆ నిర్మాణ సంస్థ అప్డేట్ ను విడుదల చేయలేదు. ఇప్పుడు కూడా అదే అయ్యేలా కనిపిస్తుంది. సినిమా విడుదల కు ఇంకా కొంత సమయమే ఉంది అయినా కానీ ఈ సినిమా యొక్క మేజర్ అప్డేట్ ఇంకా విడుదల చేయకపోవడం నిజంగా దేనికి దారితీస్తుంది చూడాలి. ఈ సినిమా రాముడిగా ప్రభాస్ కనిపిస్తున్నారు. మైథలాజికల్ సినిమా గా ఇది రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: