మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఘన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు.

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , గౌతమ్ చిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి , రామ్ చరణ్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ , లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తేరకెక్కబోయే మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ బ్యానర్ లలో ఒకటి అయిన యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: