తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల లో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కు తున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన నేషనల్  క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు .

మూవీ తలపతి విజయ్ కెరీర్ లో 66 వ మూవీ గా తెరకెక్కుతోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని తెలుగు లో డబ్ చేసో5 విడుదల చేయబోతున్నారు. తమిళం లో వారసు అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ , తెలుగు లో వారసుడు అనే పేరుతో తెరకెక్కుతుంది. ఈ మూవీ తర్వాత విజయ్ ,  విక్రమ్ మూవీ తో దేశ వ్యాప్తంగా అదిరి పోయే గుర్తింపు ను తెచ్చుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో హీరో గా నటించ బోతున్నాడు. 

ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ మూవీ తెరకెక్కి మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో  తేరక్క బోతున్న రెండవ మూవీ పై విజయ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజు , తలపతి విజయ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా లోకేష్ కనకరాజు ప్రస్తుతం విజయ్ సినిమా షూటింగ్ కోసం లొకేషన్ ల వెతుకులాట లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఒక డాగ్ ఎపిసోడ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: