నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా , దునియా విజయ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించ బోతున్నాడు.

ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మోగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో నటించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ నవంబర్ నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడిమూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ అంతా కూడా భారత దేశం లోని వివిధ లొకేషన్ లలో చిత్రీకరించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో బాలకృష్ణ వయసు పైబడిన వ్యక్తి గా కనిపించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే బాలకృష్ణ కు కూతురుగా ఈ మూవీ లో శ్రీ లీల కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: