తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా వెన్నెల కిషోర్ , ప్రియదర్శి మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా , డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు ఈ మూవీ ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.  ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఒకే ఒక జీవితం మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరి పోయే అప్డేట్ ను విడుదల చేసింది. 

ఒకే ఒక జీవితం మూవీ యూనిట్ తాజాగా ఏ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ని సెప్టెంబర్ 2 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలియ జేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో శర్వానంద్ , వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ఉన్నారు.  ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టు కున్నారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ లో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: