ఇటీవలికాలంలో బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం నడిపిస్తున్న హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ  కామెడీ షో కి లేనంత క్రేజ్ అటు జబర్దస్త్కు ఉంది అని చెప్పాలి. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో ఎప్పుడు కొన్ని జోడీలు  ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటు  ఉంటాయి.  ఇక ఇలాంటి జోడి లలో  రష్మీ సుధీర్  జోడి కూడా ఒకరు. రష్మీ సుధీర్ డి జోడి తర్వాత జబర్దస్త్ లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది వర్ష, ఇమ్మానియేల్  జోడి అని చెప్పాలి. మొన్నటి వరకు జబర్దస్త్ జడ్జ్ గా ఉన్న రోజా వీరికి బ్లాక్ అండ్ వైట్ జోడి అని పేరు పెట్టడంతో  వీరికి మరింత పాపులారిటీ వచ్చింది.


  వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరచుకుంటూ  ఉండటంతో  అది బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి. అయితే అదంతా కేవలం టిఆర్పీ  కోసం మాత్రమే అన్న విషయం మాత్రం తర్వాత కాలంలో అందరికీ అర్థమైపోయింది.   అయినప్పటికీ అప్పుడప్పుడు తమ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది అని అందరిని నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది  ఈ జోడి.  ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల నాకు వర్ష వద్దు.. ఇక వర్షా నా లైఫ్ లో వర్ష  లేదు అంటూ ఇమ్మానియేల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 ఇమ్మానియేల్ ఇలా అనడానికి కారణం కూడా ఉంది.  ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా  జబర్దస్త్ ప్రోమో లో భాగంగా రంగ రంగ వైభవంగా హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ ప్రమోషన్స్  కోసం వచ్చారు. ఈ క్రమంలోనే కేతికశర్మను  చూసిన ఇమాన్యుయేల్ నా లైఫ్ లో ఇక వర్ష లేదు ఐ లవ్ యు కేతిక అంటూ ఆమె దగ్గరికి వెళ్లి ప్రపోస్ చేస్తాడు ఇమ్మానియేల్.  ఇక ఇమ్మానియేల్ అలా అనడంతో వర్ష  ఏకంగా వైష్ణవ్ తేజ్ దగ్గరికి వెళ్లి ప్రపోస్  చేస్తుంది. ఇది కాస్త  ప్రోమో లో హైలెట్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: