పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది . ఈ సినిమా వివిధ కారణాల చేత పలుచోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయింది. అయితే వాస్తవానికి భీమ్లా నాయక్ సినిమా తెలుగులో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు. అయితే ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు నార్త్ లో బాగా పేరు సంపాదిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే అభిమానులు మద్దతు కూడా ఈ సినిమాని బాలీవుడ్ లో తీసుకువెళ్లాలని పట్టుపట్టారు.


అయితే నిర్మాతలు కూడా ఈ సినిమాని హిందీలో విడుదల చేస్తే బాగుంటుంది అని అధికారికంగా ప్రకటించారు.. కానీ తెలుగులో విడుదలైన ఈ సినిమా హిందీలో విడుదల కాలేదు అందుకు కారణం డబ్ వర్షన్ లీగల్ సమస్యలు తలెత్తడమే అన్నట్టుగా సమాచారం. అయ్యప్పను కోషియమ్ చిత్రానికి రీమెక్ గా భీమ్లా నాయక్ సినిమా అని తెరకెక్కించారు అయితే ఈ సినిమా మలయాళం లో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ వారు తీసుకున్నారు. కానీ హిందీ రైట్స్ ను మాత్రం బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సొంతం చేసుకున్నారు


ఏకే రీమిక్స్ రైట్స్ తన వద్ద ఉన్న కారణంగా ఈ సినిమా ని హిందీలో రీమిక్స్ చేసి డబ్బింగ్ చేసి విడుదల చేయడంపై.. జాన్ అబ్రహం టీం అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.. అయితే కోర్టులో ఈ సినిమాపై కేసు వేసినట్లుగా కూడా తెలుస్తోంది.. కానీ కోర్టు మాత్రం భీమ్లా నాయక్ సినిమాకె అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమాని హిందీ భాషలో సినిమాని విడుదల చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కారణాలు ఏవైనా సరే భీమ్లా నాయక్ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్ట లేకపోయింది. ఇక అలాంటి సినిమా బాలీవుడ్ లో ఎలా రాబడుతుంది అని అంచనా చిత్ర బృందం వేస్తున్నట్లుగా సమాచారం. ఇక అంతే కాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయగా నిరాశని మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: