ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమాతో ఆయనకు ఎంతగా పేరు వచ్చింది అంటే మల్టీస్టారర్ సినిమానే అయినా కూడా సోలో హీరో సినిమా అన్నట్లుగానే రామ్ చరణ్ కు భారీ స్థాయిలో ఉపయోగపడుతుంది. ఆస్కార్ బరిలో కూడా ఈ సినిమా ఉన్నట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో చెప్పారు. ఫైనల్ గా చరణ్ కు ఈ సినిమా ద్వారా మంచి ఉపయోగమే కలిగింది అని చెప్పాలి.

ప్రస్తుతం యాడ్స్ చేయడంలో చరణ్ ఎంతో బిజీగా ఉన్నారు. పలు భారీ ప్రకటనలు చేసే కంపెనీలు ఈ హీరోతో తమ ప్రోడక్ట్ యొక్క ప్రకటన చేసి ప్రేక్షకులకు అందించాలని ఎంతగానో కోరుకుంటుంది. ఆ విధంగా ఇప్పటిదాకా ఎన్నో ప్రాడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయగా ఇప్పుడు మరికొన్ని ప్రోడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ ఉండడం విశేషం. దీనికి సంబంధించిన విషయాలను మెగా అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూ తమ హీరో యొక్క రేంజ్ ను తెలియపరుస్తున్నారు. 

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టిన రామ్ చరణ్ దానిని తొందరలోనే పూర్తిచేసే విధంగా ప్రయత్నాలు చేపట్టారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావించగా అప్పటికైతే ఈ సినిమా విడుదల అవదు అని కొన్ని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల్లో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు. ఆ విధంగా ఈ మూడు సినిమాల తో మరొక రెండేళ్లు ఈ హీరో ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. వాటి ద్వారా ఎంతటి స్థాయిలో క్రేజ్ అందుకుంటారో ఆయన చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: