టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వినగానే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో అనే పేరు గుర్తుకు వస్తుంది అభిమానులకు.జక్కన్న తెరకెక్కించిన rrr చిత్రం ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించి అభిమానులను సంతోషపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు.ఇక ఇటీవల గత కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో హైదరాబాదులో ఎన్టీఆర్ ని కలిసి rrr సినిమాలో తన నటనపై ప్రశంసించడం జరిగింది. ఇప్పుడు ఆ సమావేశం మరొకసారి సోషల్ మీడియాలో చర్చిని అంశంగా మారుతున్నది.ఆ సమావేశం జరిగిన వెంటనే ఏదో రాజకీయ కోణం ఉంది అంటూ పలు వార్తలు ఎక్కువగా ప్రచారంలో వినిపించాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ ను తమ ప్రచారానికి వాడుకోబోతున్నట్లు అభిమానులలో పలు ప్రశ్నలు తలెత్తాయి అయితే ఈ మీటింగ్ తర్వాత అలాంటి విషయం ఏమి లేదని విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.


ఎన్టీఆర్ ట్రాన్స్ ఫర్ మేషన్ విషయంలో ఇప్పుడు జోరుగా ఒక విషయం వినిపిస్తోంది తాజాగా ఎన్టీఆర్ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఆగస్టు 22న దిగిన కొన్ని ఫోటోస్ ని ఇప్పటి తాజా ఫోటోలను పోల్చి చూసి అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ తారక్తారక్ ఒకరేనా అంటూ ఈ ఫోటోలు చూసి నోరెళ్ళ పెడుతున్నారు ఎందుచేత అంటే అప్పటికి ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ లో చాలా మార్పు వచ్చినట్లుగా గమనించవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ చాలా సిమ్ముగా కనిపిస్తున్నాడు అంతేకాకుండా గడ్డం కూడా తీసివేయడంతో నుంచి ఉన్న లుక్ ఒక్కసారిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో 12 రోజులకే ఇంత మార్పు అంటూ పలువురు నెటిజన్స్ ఎన్టీఆర్ను ప్రశంసిస్తూ ఉన్నారు.నిజానికి ఎన్టీఆర్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. అందుకే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ గా ప్రస్తుతం ఆయన దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం ఆయన కొరటాల శివతో తన 30 వ సినిమా ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 31వ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: