కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందారు హీరో ధనుష్. ఇక టాలీవుడ్ లో కూడా మంచి క్రేజీ హీరోగా పేరు పొందాడు. ఇక తను తాజాగా నటించిన చిత్రం తిరుచిట్రపళం. ఈ సినిమాని తెలుగులో తీరుగా విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ గా నిత్యమీనన్, రాశీ ఖన్నా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించారు. అలాగే డైరెక్టర్ భారతి రాజా, ప్రకాష్ రాజ్ నటి రేవతి ఇతరులు కీలకమైన పాత్రలు ఈ సినిమాలో కనిపించడం జరిగింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ సమస్త ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వం ఆర్.జవహర్ వ్యవహరించారు. సంగీతాన్ని మాత్రం అనిరుద్ అందించారు.


సినిమా ఆగస్టు 18వ తేదీన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా విడుదలైంది కానీ..బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లనే రాబట్టింది ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది ఈ చిత్రము. ఇంకా ఇప్పటికి ఈ సినిమా థియేటర్లలో ఆడుతూ ఉన్నది కేవలం తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సినిమాలు అన్ని నెల రోజులలోపే ఓటీటిలో విడుదలవుతూ ఉన్నాయి.

అలా ధనుష్ నటించిన తిరు సినిమా కూడా నెల లోపే ఓటీటిలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా ఓటీపీ హక్కులను ప్రముఖ దిగ్గజ సమస్తాయి నెట్ ఫ్లెక్స్ తో పాటు సన్ నెక్స్ట్ కూడా దక్కించుకున్నది. ఈ క్రమంలోనే ఈనెల 17వ తేదీన ఓటీటి లోకి ఈ సినిమా అందుబాటు రానున్నట్లు సమాచారం అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటన రాలేదు త్వరలోనే వెలుబడుతుందేమో చూడాలి. హీరో ధనుష్ డైరెక్ట్ గా ఒక తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నాడు అలాగే ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: