సీనియర్ హీరోలు నాగార్జున చిరంజీవిలు రకరకాల టాక్ షోలను హోష్ట్ చేస్తున్న రోజులలో బాలకృష్ణ బుల్లితెర షోలకు హోష్ట్ గా వ్యవహరించి రాణించగలడు అంటూ అతడి అభిమానులు కూడ ఊహించలేకపోయారు. అయితే ఎవరి ఊహలకు అందని విధంగా బాలయ్య హోష్ట్ చేసిన అన్ ష్టాపబుల్ టాక్ షో ఆహా లో సూపర్ క్లిక్ కావడమే కాకుండా ఆషోకు దేశ వ్యాప్తంగా ప్రసారం అయిన బుల్లితెర టాక్ షోలలో అత్యధిక రేటింగ్స్ రావడంతో బాలకృష్ణ పేరు మారుమ్రోగి పోయింది.


దీనితో ఆహా లో ప్రసారం అవ్వబోయే అన్ ష్టాపబుల్ షో పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈషో ఖచ్చితంగా ఉంటుంది అని ఆహా సంస్థ క్లారిటీ ఇస్తున్నప్పటికీ ఈషో ప్రారంభం ఎప్పటి నుండి అన్న విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం బాలయ్య గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి అనీల్ రావిపూడి మూవీ వైపు అడుగులు వేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.


ఒకవైపు తన సినిమాలు కొనసాగిస్తూనే మధ్యలో రాజకీయాలతో పాటు ఆహా షోను కూడ పూర్తి చేయాలని బాలయ్య ఆలోచన అని అంటున్నారు. దీనికితోడు ఈషోకు స్క్రిప్ట్ అందించవలసి ఉన్న రచయిత బిబి ఎస్ రవి ఈ షోకు అందించవలసిన స్క్రిప్ట్ విషయంలో చేస్తున్న ఆలస్యం కూడ ఒక కారణం అంటున్నారు. రవి స్క్రిప్ట్ అందించిన నాగచైతన్య మూవీ ‘థాంక్యూ’ మూవీ ఘోర పరాజయం చెండంతో రవి షాక్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


దీనితో రచయిత రవి ఆ షాక్ నుండి తేరుకుని అన్ ష్టాపబుల్ స్క్రిప్ట్ పూర్తి చేసే వరకు ఈషో ప్రారంభం అయ్యే అవకాశం లేదు అని అంటున్నారు. దీనికితోడు ఈషో సీజన్ 2 లో చిరంజీవి నాగార్జున వెంకటేష్ లతో ఇంటర్వ్యూ చేయించే ప్రాజెక్ట్ ఆలోచనతో ఉండటంతో బాలయ్యతో ఇంటర్వ్యూకు వారు రెడీ చెప్పే వరకు ఈషో ప్రారంభం అవ్వకపోవచ్చు అన్న సంకేతాలు కూడ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: