ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైస్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనసూయ , రావు రమేష్ , సునీల్ ఇతర ముఖ్యపాత్రలో నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీలో సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. సమంత స్పెషల్ సాంగ్ కి అద్భుతమైన క్రేజ్ లభించింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సౌత్ తో పాటు నార్త్ నుండి కూడా మంచి క్రేజ్ లభించింది.  పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే పుష్ప ది రూల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ మూవీ మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు పెట్టనునట్లు తెలుస్తోంది. పుష్ప ది రైస్ కంటే పుష్ప ది రూల్ మూవీ ని గ్రాండ్ గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అలాగే పక్కా ప్లానింగ్ తో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్లి వచ్చే సంవత్సరం చివరి వరకు ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని మూవీ యూనిట్ చూస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: