టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ని కొనసాగి స్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ కి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించగా , రీతు వర్మమూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రియదర్శి , వెన్నెల కిషోర్మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించగా ,  అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమా విడుదలకు ముందే మరో కొత్త మూవీ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

శర్వానంద్ , రాశి కన్నా హీరోయిన్ గా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తేరక్కబోయే మూవీ లో నటించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు టైటిల్ ని ఫిక్స్ చేయని ఈ మూవీ సోమవారం లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఇలా శర్వానంద్ ఒక సినిమా విడుదలకు ముందే మరో మూవీ ని లైన్ లో పెట్టి ఫుల్ జోష్ లో తన కెరీర్ ని ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: