టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా గిరీశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ,  పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది.  ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 31 లక్షలు .
సీడెడ్ : 10 లక్షలు .
యూ ఏ : 12 లక్షలు .
ఈస్ట్ : 9 లక్షలు .
వెస్ట్ : 6 లక్షలు .
గుంటూర్ : 16 లక్షలు .
కృష్ణ : 7 లక్షలు .
నెల్లూర్ : 5 లక్షలు .
1 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగ రంగ వైభవంగా మూవీ 0.96 కోట్ల షేర్ , 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 4 లక్షలు .
ఓవర్ సీస్ లో :  7 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా 1 వ రోజు రంగ రంగ వైభవంగా మూవీ 1.07 కోట్ల షేర్ , 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రాబోయే రోజుల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: