బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన రన్బీర్ కపూర్ తాజాగా బ్రహ్మాస్త్రం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో రన్బీర్ కపూర్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా ,  అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా చాలా గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ మూవీ ని తెలుగు లో దర్శక ధీరుడు రాజమౌళి మిమ్మల్ని సమర్పిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను సెప్టెంబర్ 2 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు , ఆ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ రానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

అలాగే ఆ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చిత్ర బృందం రామోజీ ఫిలిం సిటీ లో చేసింది. అయితే చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోయింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కోసం మూవీ యూనిట్ 2.25 ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడంతో ఈ ఖర్చు అంతా వృధా అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చివరి నిమిషంలో 10 లక్షల రూపాయలతో పార్క్ హయత్ లో ఈ మూవీ యూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: