బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇంకా అతని భార్య స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బ్రహ్మాస్త్రం.ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాని తెలుగులో డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున మౌని రాయ్ అమితాబచ్చన్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు నటించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు.ఇక ఈ కార్యక్రమం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దు అయింది.ఇక ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని అన్ని ఏర్పట్లు ఘనంగా నిర్వహించారు. చివరి నిమిషంలో ఈ కార్యక్రమ ప్రీ రిలీజ్ రద్దు కావడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు.


ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక రద్దు కావడంతో చిత్ర బృందం మరికొన్ని కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి రెడీ అయ్యారు.ఈ క్రమంలో ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ ప్రోగ్రాంలో బ్రహ్మాస్త్ర చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10 శనివారం సాయంత్రం ప్రసారం కానుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, ఎస్ఎస్ రాజమౌళి పాల్గొన్నట్టు ప్రోమోలో తెలుస్తుంది.ఎన్నో అంచనాలతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక ఈ సినిమాకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: