టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంకా యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ-2' సినిమా కలెక్షన్స్ చూసి పాన్ ఇండియా మేకర్స్ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో కలెక్షన్లలో ఈ సినిమా దుమ్ములేపుతుంది.యూఎస్ కలెక్షన్లు ఆదివారం నాటికి 1.5 మిలియన్ డాలర్లు చేరతాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఇలా కలెక్ట్ చేస్తే.. ఇది సరికొత్త రికార్డు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. కానీ శనివారం నాటికి సినిమా ఆ టార్గెట్‌ను రీచ్ అవ్వడం విశేషం. ఈ విషయంలో బయ్యర్లు సైతం సర్ ప్రైజ్ అయ్యారు. ఈ స్థాయిలో ఈ సినిమా వసూళ్ళను సాధిస్తోందని ఎవ్వరూ ఊహించలేదు.మొత్తానికి ఇప్పటివరకు అమెరికాలో ఈ చిత్రం మొత్తం గ్రాస్ 1,509,768 డాలర్లుగా ఉంది. నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలుచేసింది. అబద్దపు కలెక్షన్ల మాయాజాలంలో పూర్తిగా ఫేక్ పబ్లిసిటీతోనే బ్రతికే సినిమా స్టార్లు ఉన్న ఇండస్ట్రీలో నిజాయితీతో హిట్ కొట్టాడు నిఖిల్.


కార్తికేయ 2తో సూపర్ హిట్ కొట్టాక కూడా మీడియా మాయలో కొట్టుకుపోవాలనుకోలేదు.సక్సెస్ అందుకున్న హీరోనే అయినప్పటికీ.. నిర్మాతల అడ్వాన్స్ లకు తలొగ్గలేదు. పైగా 'కార్తికేయ 2' హిట్ కి కారణం తన గొప్పతనం కాదు, సినిమా కథకు ఉన్న కెపాసిటీ అది అని సగర్వంగా చెప్పాడు. గ్రాఫిక్స్ స్వర్గంలో తేలియాడకుండా నిజాయితీగా నేల మీదే ఉన్నాడు. అన్నిటికీ మించి తన సినిమా కలెక్షన్స్ విషయంలో ఎంతో క్లారిటీగా ఉన్నాడు.కేవలం ఒక సాధారణ చిన్న సినిమాగా రిలీజ్ అయిన కార్తికేయ 2, అన్ని కోట్లు ఎలా కలెక్ట్ చేసిందనేది  ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా వైరల్ అవుతున్న షాకింగ్ విషయం. రోజులు గడిచే కొద్దీ.. రోజురోజుకు తన వసూళ్లను పెంచుకుంటూ పోతుంది 'కార్తికేయ 2'. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకూ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: