టాలీవుడ్ స్టార్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని వరంటూ ఉండరు.అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు, అటు రాజకీయాల్లో బిజీగా వున్నాడు.ఇదిలావుంటే ఇక సాయి ధరమ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన పలు సినిమాలలో నటించి నటుడుగా ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే ఈయన స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయాడు.ఇదిలావుంటే ఇక అలా స్టార్ హోదా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సాయి ధరం తేజ్ కు తన మేనమామ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చింది.  ఈ సినిమాతో సాయిధరమ్ కు ఎలాగైనా స్టార్డం వస్తుందని అందరూ అనుకున్నారు.అంతలోనే పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే రీ ఎంట్రీ నుంచి పవన్ కళ్యాణ్ అన్ని రీమేక్ సినిమాలే చేస్తున్నాడు. ఇక అలా రీమేక్ సినిమాలతో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మంచి బ్లాక్ బస్టర్ హిట్టును సొంతం చేసుకున్నాయి. వీటితోపాటు మరికొన్ని రీమేక్ సినిమాలు కూడా సైన్ చేశాడు పవన్ .ఇక అందులో తమిళంలో మంచి హిట్ అందుకున్న వినోదయ సీతం అనే సినిమాను డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో చేయనున్నాడు.ఇకపోతే ఈ సినిమాలో కీలక పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ ను తీసుకున్నట్లు తెలిసింది. కాగా తన మేనమామ సినిమాలో నటించడానికి సాయిధరమ్ తేజ్ తనకు లైన్లో ఉన్న సినిమాలను కూడా పక్కన పెట్టాడు. అయితే నిజానికి ఈ సినిమా ఆగస్టులోనే ప్రారంభించాలని అనుకున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా సెట్ లోకి కూడా వెళ్లలేదు. కాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది కూడా తెలీదు.తాజాగా.. వాయిదా పెట్టిన 'హరి హర వీరమల్లు' షూటింగ్‌కి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఈ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట పవన్.ఇక  ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావాలని ప్లాన్‌ చేస్తున్నారట. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిసింది. సాయిధరమ్‌తో కలిసి చేయాల్సిన 'వినోదయ సీతం' సినిమా గురించి మాత్రం ఏ టాక్ లేదు. ఇక దీంతో సాయి ధరమ్ తను ముందు ఫిక్స్ అయినా సినిమాలో షూటింగ్లలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంతకాలం మేనమామ సినిమా కోసం ఎదురుచూసిన సాయి ధరమ్ తేజ్ కు పవన్ షాకిచ్చాడు అని.. మామను నమ్ముకుంటే ముంచేసాడు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: