ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తొందరలోనే మొదలు కాబోతున్నాయి. వాటిలో ముందుగా
కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్
సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చేస్తున్న ఈ రెండవ
సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని
ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్
సినిమా ద్వారా భారీ స్థాయిలో గుర్తింపు అందుకున్న ఈ
హీరో ఇప్పుడు పాన్
ఇండియా వైడ్ గా వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవడానికి పలువురు అగ్ర దర్శకులతో కలిసి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే
కొరటాల శివ సినిమా తర్వాత
ప్రశాంత్ నీఎలల్ దర్శకత్వంలో
సినిమా చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టడానికి
ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ సలార్ చిత్రం పైనే ఉంది. ఈ సినిమాలో
ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.
అయితే కొంతమంది
ఎన్టీఆర్ అభిమానులు ఫ్లాపులో ఉన్న
కొరటాల శివ ను ఎంచుకోవడం
ఎన్టీఆర్ చేసిన తప్పు అని చెబుతున్నారు అలాకాకుండా ఒక హిట్ దర్శకుడుని ఎంచుకున్న
సినిమా చేస్తే ఇంకా బాగుండేదని కూడా వారు సలహాలు ఇస్తున్నారు. వరుస భారీ విజయాలను
టాలీవుడ్ కి తెచ్చిపెట్టిన
కొరటాల శివ ఓకే ఒక ఫ్లాప్ తో ఒక్కసారిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఆచార్య
సినిమా ఆయనకు ఎంత పెద్ద ఫ్లాప్ ని తీసుకు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ
సినిమా యొక్క ఫ్లాప్ తాలూకు ప్రభావం
హీరో పై కాకుండా దర్శకుడు పైనే పడడం
కొరటాల అభిమానులను నిరాశ పరుస్తుంది. మరి
ఎన్టీఆర్ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకొని
సక్సెస్ బాట
కొరటాల శివ పడతాడా అనేది చూడాలి.