పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన పూర్తి దృష్టి మొత్తం ఒకే ఒక సినిమాపై ఉన్నట్లుగా తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాను ముందుగా పూర్తి చేసి ఆ తర్వాతే ఆయన తన తదుపరి సినిమాల జోలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. తన రీయంట్రిలో వరుస సినిమాలను ఒప్పుకుంటూ పోతూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండు సిని మాలు తో ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాడు.

ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఒక చారిత్రాత్మక సినిమాను ఆయన ఒప్పుకోవడం పవన్ అభిమానులను ఎంతగానో సంతోష పెట్టింది. మొగలుల కాలంనాటి కథతో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఆగిపోయిందని మొన్నటిదాకా వార్తలు బాగా వినిపించాయి. ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమాను పూర్తిగా మేకర్స్ పక్కన పెట్టేసినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడంతో ఈ సినిమా క్యాన్సిల్ కాలేదని అందరూ నమ్మారు. 

 అయితే ఒకేసారి రెండు మూడు సినిమాలను కాకుండా పవన్ కళ్యాణ్ ముందుగా ఈ సినిమాను పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.  మరి ఎన్నో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ కు విజయాన్ని తెచ్చి పడుతుందో చూడాలి. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం మాత్రమే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను పవన్ కళ్యాణ్ చేయవలసి ఉంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను ఇప్పటికే ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: