పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.అయితే ప్రస్తుతం ఆయన చేతిలో ఇప్పటికే మూడు చిత్రాలు ఉన్నాయి.ఏంటంటే 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్', 'వినోదయ సీతం' చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఇక ఈ క్రమంలో అభిమానులకు పవన్ సర్ ప్రైజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మేరకు తన తదుపరి చిత్రంపైనా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది.ఇక యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్స్ కు యంగ్ అండ్ టాలెటెండ్ డైరెక్టర్ సుజీత్  కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. అంతేకాదు గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సాహో' చిత్రాన్ని తెరకెక్కించి తన మార్క్ చూపించిన విషయం తెలిసిందే.

ఇక  తీసినవి రెండు చిత్రాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో సుజీత్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించకున్నాడు.ఇకపోతే మూడేండ్లుగా తన సినిమాలపై ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయని సుజీత్ రెడ్డి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ కూడా నెరేట్ చేశారని, పవన్ కూడా ఒకే అన్నారని ప్రచారం జరుగుతోంది.ఇక  పవన్ తో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందించబోతున్నారంట దర్శకుడు సుజీత్.ఇకపొతే ఈ కాంబినేషన్ సెట్ అయ్యిందనడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.అయితే  'పంజా' తరహాలో సినిమాను తెరకెక్కించాలని సుజీత్ ను కోరుతున్నారు.

ఇక ఇప్పటికే వరుసపెట్టి రీమేక్ లు చేస్తున్న పవర్ స్టార్ ను కూడా ఈసారైనా రీమేక్ కాకుండా చూడాలని కోరుతున్నారు.అంతేకాదు  పక్కా యాక్షన్ ఫిల్మ్ నే దింపుతున్నారని తెలుస్తోంది.అయితే  ఈ చిత్రంపై ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాకున్నా.. అభిమానులు, సినీ వర్గాలు మాత్రం వీరి కాంబో సెట్ అయ్యిందంటున్నారు.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' రెగ్యూలర్ షూటింగ్ లో ఉన్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన 'పవర్ గ్లాన్స్'కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అంతేకాదు మరోవైపు వపన్ ఒకే చేసిన చిత్రాల్లో 'భవదీయుడు భగత్ సింగ్', 'వినోదయ సీతం' చిత్రాలు కూడా ఉన్నాయి.  ఈ చిత్రాలు మొదలే కాలేదు. అయితే ఈ క్రమంలో సుజీత్ తో సినిమా లాక్ అంటూ, ఇది క్విక్ ప్రాజెక్ట్ గా ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చే ఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: