టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దర్శకుడైన పూరి జగన్నాథ్ పై చాలామంది ఎన్నో రకాల విమర్శలు చేశారు. ఒక మంచి హీరోతో మంచి సినిమా చేయవలసింది పోయి ఇలాంటి సినిమా చేయడంపై ఆయనపై ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేశారు. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే తదుపరి సినిమా ఎలా ఉంటుందో ఉండదో అన్న అనుమానాలను చాలా మంది వ్యక్తం చేశారు.

 పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమా మొదలుపెట్టాలని చూస్తున్న ప్రతిసారి కూడా ఈ విధం గా ఏదో ఒక అడ్డంకు రావడం నిజంగా పూరి జగన్నాథ్ కు ఎంతో నిరాశను మిగిలిస్తుందని చెప్పాలి. అయితే ఎన్నో అంచనాల మధ్య అవి ఇద్దరు కలిసి ఈ సినిమాను చేయబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం ఇప్పుడు పూర్తిగా ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తొందర్లోనే రాబోతుంది ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ టు సినిమాపై పూర్తి దృష్టి సారించినన్నారు.  

విజయ్ దేవరకొండ కూడా తాను తదుపరి చేయబోయే సినిమాలపై దృష్టి పెట్టబోతున్నాడు. ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వం లో కృషి అనే సినిమాను చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరొక సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అంతేకాదు త్వరలోనే దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ సినిమాను కూడా ఆయన చేయబోతున్నాడు. మరి జనగణమన సినిమాకు పూరి జగన్నాథ్ మళ్లీ ఏ హీరోతో చేస్తాడో చూడాలి. టైగర్ సినిమా విజయాన్ని సాధించి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది అలా కాకుండా భారీ పరాజ్యం కావడంతోనే ఈ విధమైన ఇబ్బంది ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: