తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లపాటు పాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగాడు పూరీ జగన్నాథ్. అయితే గడిచిన కొంతకాలంగా తన రేంజ్ కి  తగ్గ బ్లాక్ బస్టర్ సినిమాలు పడకపోవడంతో అభిమానుల సైతం చాలా ఆవేదనకు గురవుతున్నారు.  చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు.  ఇప్పుడు లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్నారు.  దీంతో పూరీ జగన్నాథ్ పైన నెగెటివిటీ చాలా మూటగట్టుకుందని చెప్పవచ్చు. హీరో విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా చూసిన వారందరూ హేళన చేస్తూ ఉండడం జరుగుతోంది.

లైగర్ సినిమా విడుదల అవ్వడానికి ముందే పూరీ జగన్నాథ్,  విజయ్ కాంబినేషన్లో జనగణమన అనే సినిమాను కూడా సెట్స్ మీదికి తీసుకువెళ్లారు.  అయితే వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుందని అందరూ భావించారు. అందుకు సంబంధించి రెండు షెడ్యూల్స్ ని కూడా సినిమా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా లైగర్ భారీగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు దర్శక హీరోలందరూ తమ కథలోని లైనప్ లను మార్చుకుంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో జనగణమన చిత్రాన్ని పక్కన పెట్టినట్లుగా సమాచారం .


పూరీ జగన్నాథ్ దీని ప్రాజెక్ట్ పూరీ కనెక్ట్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేయగా. ఇక ఇందులో మరొక గ్రూప్ సంస్థ వారు తప్పుకున్నట్లుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుచేతనే ఈ సినిమాని వదిలేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక పూరీ జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు జనగణమన సినిమాని పక్కనపెట్టి ఆ చిత్రాన్ని చేయాలనుకుంటున్నట్లు సమాచారం . అందుకోసం ఒక కొరియన్ చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక పూరీ, ఆకాష్ చివరిగా రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడైనా తన కొడుకుకి ఘనవిజయాన్ని అందిస్తాడని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: