ప్రభాస్ కు ఇప్పుడు ఒక బ్లాక్ బష్టర్ హిట్ కావాలి. ఇప్పటికే రెండు ఫ్లాప్ లు ప్రభాస్ ను చుట్టుముట్టడంతో అతడి అభిమానులు ప్రభాస్ కంటే టెన్షన్ పడిపోతున్నారు. సంక్రాంతికి ‘ఆదిపురుష్’ వస్తున్నప్పటికీ ప్రభాస్ అభిమానుల దృష్టి మాత్రం పూర్తిగా ‘సలార్’ పైనే ఉంది.


దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను అతడి అభిమానులు కోరుకునే రీతిలో చూపెట్టి బ్లాక్ బష్టర్ హిట్ ఇస్తాడు అన్న నమ్మకంలో డార్లింగ్ అభిమానులు ఉన్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సలార్’ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదలకాబోతోంది అంటూ ఇప్పటి నుంచే ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగి పోతోంది.


ఈ పరిస్థితులలో ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ వచ్చే ఏడాది ఒక చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈమధ్య ప్రభాస్ కు సర్జరీ జరగడంతో బ్రేక్ పడ్డ ఈమూవీ షూటింగ్ తిరిగి లేటెస్ట్ గా ప్రారంభం అవుతున్న సమయంలో ఈమూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ‘వైలెంట్’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘కేజీ ఎఫ్ 2’ లో కూడ వైలెన్స్ విపరీతంగా ఉంది.


అయితే ఎంత వైలెన్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా ఈమూవీకి 12వందల కోట్లకు పైగా కలక్షన్స్ కురిపించారు. మళ్ళీ సలార్ లో కూడ ‘వైలెన్స్ వైలెన్స్’ అంటూ సగటు ప్రేక్షకుడుని ప్రశాంత్ నీల్ ఊదరకొడితే అసలుకు మోసం వస్తుందేమో అని ప్రభాస్ అభిమానులు భయపడిపోతున్నారు. ‘ఆదిపురుష్’ మూవీతో ప్రభాస్ కు శ్రీరాముడు గా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది కానీ ఆసినిమాకు వేల కోట్ల కలక్షన్స్ రావు అని అభిమానుల సందేహం. ఇలాంటి పరిస్థితులలో ‘సలార్’ కథలో వెరైటీ కనిపించకపోతే అది మళ్ళీ ‘కేజీ ఎఫ్ 2’ సినిమాను మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుందా అన్నభయాలు ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: