తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న అతి కొద్ది మంది ముద్దుగుమ్మలలో ఒకరు అయినా సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ ప్రేమమ్ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను మలయాళ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న సాయి పల్లవి ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.  

ఫిదా మూవీ లోని తన నటనతో , డాన్స్ తో  సాయి పల్లవి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుం.ది అలాగే ఫిదా మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఆ తర్వాత నుండి సాయి పల్లవి కి అద్భుతమైన సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కాయి. ఇది ఇలా ఉంటే సాయి పల్లవి కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండటం మాత్రమే కాకుండా స్కిన్ షో కి ప్రాధాన్యత ఉన్న పాత్రలకు చాలా దూరంగా ఉంటూ కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న డీసెంట్ క్యారెక్టర్ లలో మాత్రమే నటిస్తూ తన కెరియర్ ని ముందుకు సాగిస్తుంది.

ఇలా స్కిన్ షో కి ప్రాధాన్యత ఉన్న పాత్రలకు దూరంగా ఉండడం , అలాగే తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న మూవీ లలో మాత్రమే నటిస్తూ రావడంతో సాయి పల్లవి కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే సాయి పల్లవి కి ఒక భారీ పాన్ ఇండియా మూవీ లో అవకాశం దక్కినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి పోయిన సంవత్సరం విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన పుష్ప ది రైస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న పుష్ప ది రూల్ మూవీ లో సాయి పల్లవి కి అవకాశం దక్కినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: