తమిళ ఇండస్ట్రీలో నటుడిగా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో విజయ్ సేతుపతి ఒకరు. విజయ్ సేతుపతి కేవలం తమిళ సినిమాలలో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే తెలుగు లో చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీ లో ఒక కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో విజయ్ సేతుపతి నటించి సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాడు.

ఇలా ఇప్పటికే తెలుగు లో రెండు మూవీ లలో నటించి విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన విక్రమ్ మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే విజయ్ సేతుపతి కి మరో క్రేజీ మూవీ లో ప్రతి నాయకుడి పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా ,  తమిళ క్రేజీ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే ఒక మూవీ తేరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్ర విజయ్ సేతుపతి ని మూవీ యూనిట్ తీసుకోనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రతి నాయకుడు పాత్ర కోసం విజయ్ సేతుపతి దాదాపు 21 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ పుచ్చుకోనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఇప్పటి వరకు ఇండియా లోనే ప్రతి నాయకుడు పాత్ర కోసం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడుగా విజయ్ సేతుపతి నిలవనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: