తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న అతి కొద్ద మంది హీరో లలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది.

ఇలా మొదటి మూవీ తోనే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కేతిక శర్మ , వైష్ణవి తేజ్ కు జోడిగా నటించగా , గిరీశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. సెప్టెంబర్ 2 వ తేదీన ఈ మూవీ విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 1.00 కోట్లు .
సీడెడ్ : 27 లక్షలు .
యూ ఏ : 35 లక్షలు .
ఈస్ట్ : 25 లక్షలు .
వెస్ట్ : 17 లక్షలు .
గుంటూర్ : 29 లక్షలు .
కృష్ణ : 23 లక్షలు .
నెల్లూర్ : 14 లక్షలు .
5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగ రంగ వైభవంగా మూవీ 2.70 కోట్ల షేర్ , 4.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 20 లక్షలు .
ఓవర్ సీస్ లో : 49 లక్షలు .
5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రంగ రంగ వైభవంగా మూవీ : 3.39కోట్ల షేర్ , 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: