మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకులను పలు సినిమాలతో ఆకట్టుకున్న రామ్ చరణ్ ఈ సినిమా తోనూ మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అయన హీరోగా చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన శంకర్ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని కూడా భారీ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దక్షిణాదిన అగ్ర దర్శకుడిగా మంచి గొప్ప పేరు సంపాదించుకున్న శంకర్ తెలుగులో మొట్టమొదటిసారి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ ఫోకస్ పెట్టాడు.

దానికి తగ్గట్లుగానే ఈ సినిమా కూడా రూపొందుతుంది అని అంటున్నారు.  గతంలో ఆయన పలుమార్లు తెలుగు సినిమా చేయాలని భావించి విఫలం అయ్యాడు. ఆలా ఎంతో ఇష్టపడి ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు శంకర్. శంకర్ కు తమిళంలో ఏమాత్రం టైం సహకరించడం లేదు. కానీ ఇప్పుడు ఆయన తెలుగు సినిమా చేయవలసిన అవసరం ఏర్పడడంతో ఈ చిత్రం చేయక తప్పలేదు. గత రెండు మూడు చిత్రాలుగా ఆయన ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగుండడం లేదు. చేసిన సినిమా విడుదల అయిన తరువాత నష్టాలను తీసుకువస్తుంటే ఇంకొక సినిమా ఆర్థిక కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది.

ఇప్పుడు తెలుగులో తన సత్తా చాటడానికి సిద్ధమైపోయాడు. ఇప్పటికే చరణ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా మొదలుపెట్టి సగభాగం చిత్రాన్ని పూర్తి చేశాడు. అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా మధ్య లో ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. కంటెంట్ బాగా ఉండకపోవడంతో ఈ సినిమా యొక్క షూటింగ్ ను మధ్య లో ఆపేశారని అవుట్ ఫుట్ కి రామ్ చరణ్ ఏమాత్రం ఇష్టంగా లేదని అందుకే అయన ఈ సినిమా ను పక్కన పెట్టేశారు అని చెప్తున్నారు. త్వరలోనే దీనిపై ఇదొక నిర్ణయం తీసుకోబోతున్నాడట రామ్ చరణ్. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కాగా మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: