కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి పరిచయం అవసరం లేదు.అయితే ఈయన ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. అంతేకాకుండా వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు.ఇదిలావుంటే ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన 'బీస్ట్' తీవ్రంగా నిరాశపరిచింది.అయితే  ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు.కాగా  ప్రస్తుతం ఈయన వంశీపైడిపల్లి దర్శకత్వంలో నేరుగా తెలుగులో వారసుడు సినిమా చేస్తున్నాడు. అంతెందుకు ఇటీవలే విడుదలైన విజయ్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.ఇక  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని..

 వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కాగా  ఈ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నాడు.అయితే  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.అంతేకాదు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను సంప్రదించారట. అయితే పాత్ర నచ్చడంతో సంజయ్‌దత్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.

ఇకపోతే ప్రస్తుతం ఈయన ముఖ్య పాత్రల్లో నటుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.తాజాగా కేజీఎఫ్‌, శంషేరా వంటి సినిమాలతో తన విలనిజంతోనూ ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు టాక్.అయితే విజయ్- లోకేష్ కనగరాజ్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. ఇకపోతే గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన మాస్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం కూడా లోకేష్ తన మల్టీవర్స్‌లో భాగంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రం కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను లోకేష్ రంగంలోకి దింపనున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: