శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఒకే ఒక జీవితం. డ్రీం వారియర్ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించబడింది. శర్వానంద్ కి జోడీగా రీతు వర్మ నటించగా వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ లాంటి వారు ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. అయితే సినిమాలో అమల అక్కినేని కూడా ఇంపార్టెంట్ రోల్ లో మెప్పించారని తెలుస్తుంది. సెప్టెంబర్ 9 అంటే ఈ శుక్రారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈ సినిమాని ముందే కొంతమంది సెలబ్రిటీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ స్పెషల్ ప్రీమియర్ షోకి కింగ్ నాగార్జున, అఖిల్ అక్కినేని అటెండ్ అయ్యారు. వీరితో పాటుగా టాలీవుడ్ యంగ్ డైరక్టర్స్ టీం అంతా వచ్చేసింది. అయితే సినిమా చూసిన అందరు సూపర్ అనేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుందని చెబుతున్నారు. నాగార్జున అయితే సినిమా చూసి కొద్దిగా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది.

అంతేకాదు నాగ్ తన మదర్ అన్నపూర్ణమ్మ గారిని గుర్తు చేసుకున్నారని చెప్పడం సినిమా ఎంత బాగా టచ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. శర్వానంద్ ని హగ్ చేసుకుని విషెష్ అందించారు. ఏ సినిమా అయినా ప్రీమియర్స్ టాక్ ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ స్పెషల్ ప్రీమియర్స్ కేవలం సెలబ్రిటీస్ కోసమే వేశారు. అయినా సరే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో కెరియర్ రిస్క్ లో పడేసుకున్న శర్వానంద్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ భాషలో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది. శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: