బాలీవుడ్ లో ఇప్పుడు ఫుల్ ఫాం లో ఉన్న హీరోయిన్స్ గా కియరా అద్వాని, కృతి సనన్ ఇద్దరు గురించి చెప్పుకోవచ్చు. కృతి సనన్ మంచి దూకుడు మీద ఉంది. వరుస సినిమాలతో దుమ్ముదులిపేస్తుంది. ఈమధ్యనే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్న కృతి సనన్ ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. ఓం రౌత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా భారీ అంచనాలతో వస్తుంది.

ఇక రీసెంట్ గా కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కృతి సనన్ ఆయన నిర్మాణంలో వచ్చిన లస్ట్ స్టోరీస్ చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కియరా అద్వాని చేసిన ఆ ఎపిసోడ్ కృతి సనన్ చేయాల్సి ఉందట. ఆ వైబ్రేషన్ సీన్ కియరా అద్వానికి ఎన్ని ప్రశంసలు తెచ్చిందో అందరికి తెలిసిందే. అయితే కృతి సనన్ ఆ సీరీస్ లో చేయాలని అనుకుందట. కానీ ఆ ఒక్క సీన్ తీసేయమని అడిగిందట.

అయితే దానికి కరణ్ ఒప్పుకోకపోవడంతో కృతి ప్లేస్ లో కియరా వచ్చి చేరింది. లస్ట్ స్టోరీస్ తర్వాత కియరా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆమె కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో కూడా కియరా ఛాన్సులు అందుకుంటుంది. ఒకవేళ కృతి సనన్ ఆ సీన్స్ చేస్తే మరో రేంజ్ లో ఉండేదని అంటున్నారు. అయితే తన మదర్ కి ఆ సీన్స్ నచ్చవని అందుకే ఆ వెబ్ సీరీస్ లో నటించలేదని చెప్పింది కృతి సనన్. మరి బాలీవుడ్ లో అలా సెలెక్టెడ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటే మాత్రం కొన్నాళ్లకే కెరియర్ ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. కృతి సనన్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో 1 నేనొక్కడినే సినిమా చేసింది. ఆ తర్వాత నాగ చైతన్యతో దోచెయ్ సినిమా చేసింది. ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు అందుకే ఆమె మరో తెలుగు సినిమా చేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: