బాలీవుడ్ స్టార్ హీరో రణ బీర్ కపూర్ హీరోగా ఆయన సతీమణి హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ 400 కోట్లతో నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా బ్రహ్మస్త్ర. ఇందులో అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రలో నటించారు.ఇక బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ అలియా కు ఎదురు దెబ్బ తగిలింది.వాళ్ళిద్దరిని ఆలయంలోపలకి అనుమతించబోము అంటూ బజరంగ్ దళ్ నాయకులు అడ్డుకున్నారు .దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్ తో పెళ్లయిన తర్వాత మొదటిగా రిలీజ్ చేస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. దీంతో ఈ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు . కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకొని ఉన్నారు . దానికి మెయిన్ రీజన్ నాగార్జున.. అయితే మరొక రీజన్ ఈ సినిమాకి తెలుగులో సమర్పికుడుగా వ్యవహరిస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. దీంతో సినిమా ప్రమోషన్స్ లో బీభత్సంగా పాల్గొంటూ సినిమాను వీలైనంత విధంగా ప్రమోట్ చేస్తున్నారు బ్రహ్మాస్త్ర టీం.


ఈ క్రమంలోనే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హీరోయిన్ అలియా భట్ ,హీరో రణబీర్ కపూర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారును దర్శించుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు.అయితే ఈ విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ నాయకులు అక్కడికి వచ్చి రణబీర్ ఆలియా ని మాత్రం దేవాలయంలోకి వెళ్లడానికి ఒప్పుకోమంటూ నిరసనకు దిగారు. దానికి కారణం కూడా వారు వివరిస్తూ.." వారు బీఫ్, చికెన్ , మటన్ తింటామని చెప్పడమే " అన్నట్లు అక్కడ ఉన్నవారు చెప్పుకొచ్చారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసుల ప్రొటెక్షన్ తో ఆ దంపతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు . అంతేకాదు డైరెక్టర్ అయాన్ ముఖర్జీని మాత్రం యాక్టివిస్టులు అనుమతించారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయంలో దిగిన ఫోటోలను ఆయన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు." అమ్మవారిని దర్శించుకున్నాక నాకు డబల్ ఎనర్జీ వచ్చిందని చాలా హ్యాపీగా ఉందని" రాసుకోచ్చాడు.దీంతో ఆలియా రణబీర్ లకు ఎదురు దెబ్బ తగిలిన్నట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: