యాంకర్ శ్రీముఖి.. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. పటాస్ అనే కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బుల్లితెరపై రాకెట్ లా దూసుకుపోతుంది. ఛానల్ తో సంబంధం లేకుండా వరుసగా కార్యక్రమాలు చేస్తూ తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ తనకంటూ  ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది శ్రీముఖి. ఇక తద్వారా శ్రీముఖి ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కేవలం బుల్లితెర కార్యక్రమాల్లో రచ్చ చేయడమే కాదు సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి తన రీల్స్ తో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. శ్రీముఖి డాన్స్ పర్ఫార్మెన్స్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ  నెటిజన్లు అందరికీ కూడా పిచ్చెక్కిస్తూ ఉంటాయి.  ఇక బుల్లితెర స్టేజి మీద వేసే స్టెప్పులు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మడు ఈ టీవీ లో జాతిరత్నాలు అనే కార్యక్రమంలో యాంకర్ గా చేస్తోంది. అదే సమయంలో స్టార్ మా లో ఈవెంట్లు కూడా చేస్తూ ఉంటుంది.  ఇక జీ తెలుగులో సరిగమప షోకి హోస్టింగ్ చేస్తూ అదరగొడుతోంది.



 అయితే ఇటీవలే తెలుగు ఓటిటి ఆహా కోసం డాన్స్ ఐకాన్ అనే షో  నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇకపోతే ఈ షో లో భాగంగా ఇటీవల యాంకర్ శ్రీముఖి శేఖర్ మాస్టర్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ హాట్ టాపిక్ గా మారింది. పుష్ప సినిమాలో సమంతా చేసిన ఊ అంటావా ఉహు అంటావా అనే పాటకు శ్రీముఖి మత్తెక్కించేలా డాన్స్ చేసింది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ తో కలిసి అదిరిపోయే డాన్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అయితే ఎన్నో రోజుల నుంచి శేఖర్ మాస్టర్ శ్రీముఖి చేసే డ్యాన్సులకు సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: