నందమూరి బాలకృష్ణ అభిమానులు గత కొన్ని సంవత్సరాలుగా కలలు కంటున్నా మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ ఇక ఇప్పట్లో ఉండదా అన్న సందేహాలు బాలయ్య అభిమానులకే కాకుండా ఇండస్ట్రీ వర్గాలకు కూడ కలుగుతున్నాయి. ఈవిషయమై బాలయ్య ఎప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడం మోక్షజ్ఞ ఎంట్రీకి ఇంకా సమయం ఉంది అని అంటూ ఉండటంతో బాలయ్య వారసుడు ఇక సినిమాలకు దూరంగా ఉంటాడా అన్న సందేహాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.


కొన్ని సంవత్సరాల క్రితం మోక్షజ్ఞ నటించే తొలి మూవీని సాయి కొర్రపాటి నిర్మిస్తాడని ఆసినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తాడని ప్రచారం జరిగింది. ఆతరువాత బాలయ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పూరీ తన కొడుకును కూడ హీరోగా సెటిల్ చేయలేకపోతున్నాడు.


దీనితో పూరీ మోక్షజ్ఞ ల ప్రాజెక్ట్ కేవలం ఊహాజనితం మాత్రమే అనుకోవాలి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే బాగుంటుందని బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అది కూడ కార్యరూపం దాల్చే ఆస్కారం కనిపించడం లేదు. తెలుస్తున్న సమాచారం మేరకు బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీని ఒక ప్రముఖ దర్శకుడుతో చేయించాలని భావిస్తున్నప్పటికీ ప్రముఖ దర్శకులు అంతా టాప్ యంగ్ హీరోల చుట్టూ ప్రదక్షణం చేస్తూ ఉండటంతో ఆ ఆలోచనలు ముందుకు పోవడం లేదు అంటున్నారు.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్యా 999’ లో బాలయ్య మోక్షజ్ఞ లు కలిసి నటిస్తారు అని ఊహాగానాలు వస్తున్నప్పటికీ అసలు నిజంగా ఆసినిమాను బాలయ్య నిర్మిస్తాడా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. నందమూరి కుటుంబ సభ్యుల ఫంక్షన్స్ లో కూడ మోక్షజ్ఞ కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంలేదు. దీనితో మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఎందుకు ఇంత రహస్యం కొనసాగిస్తున్నాడు అంటూ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనితో మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ పై ఇలాంటి ఊహాగానాలు ఇంకా కొంతాలం కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: