ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదలకు రెడీగా ఉన్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ లలో  బ్రహ్మాస్త్రం మూవీ ఒకటి. ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ లో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మూవీ ని రేపు అనగా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మాస్త్రం మూవీ 2 గంటల 46 నిమిషాల 54 సెకండ్ ల నిడివితో  ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి భారీ అంచనాలు కలిగి ఉన్న బ్రహ్మాస్త్రం మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.  ఈ మూవీ 2 D మరియు 3 D వర్షన్ లలో ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ భారీ బడ్జెట్ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల కాబోతోంది. తెలుగు లో ఈ మూవీ ని దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: