తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్న శర్వానంద్ ఆఖరుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సిద్ధార్థ్ కూడా ఒక హీరోగా నటించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన మహా సముద్రం మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇలా మహా సముద్రం మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీ కార్తిక్ దర్శకత్వ వహించగా , రీతు వర్మమూవీ లో హీరోయిన్ గా నటించింది.  అక్కినేని అమలమూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , వెన్నెల కిషోర్ , ప్రియదర్శిమూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు.

మూవీ ని రేపు అనగా సెప్టెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో  ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఒకే ఒక జీవితం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: