మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. అందులో భాగంగా చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో జరగెకుతున్న గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ కండర వీరుడు సల్మాన్ ఖాన్ , టాలీవుడ్ క్రేజీ నటుడు సత్యదేవ్ , లేడీ సూపర్ స్టార్ నయన తార ముఖ్య పాత్ర లలో కనిపించ బోతున్నారు.

మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించ బోతుంది.  ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... గాడ్ ఫాదర్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ని వచ్చే సోమవారం రోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కాక పోతే ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. మరి గాడ్ ఫాదర్ మూవీ తో చిరంజీవి ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. గాడ్ ఫాదర్ మూవీ పై మెగా అభిమానులతో పాటు మాములు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: