భారీ ప్రాజెక్టు తెరకెక్కించే సినిమాలు నిత్యం లీకుల సమస్యలతో చాలా సతమతమవుతూ ఉంటారు చిత్ర బంధం. అప్పట్లో వకీల్ సాబ్ ,పుష్ప, సర్కారు వారి పాట వంటి సినిమాలు కూడా ఇలానే ఇబ్బంది పడ్డాయి అయితే ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న RC -15 చిత్రం విషయంలో కూడా ఇలాంటి సమస్య ఎదురవుతోంది. ప్రతి చిన్న విషయం కూడా లీకులు అవడంతో ప్రొడక్షన్ కంపెనీని చాలా కలవర పెడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. డైరెక్టర్ శంకర్ చేస్తున్న ఈ చిత్రం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. ఇక ఎస్జె సూర్య, సునీల్, సముద్రఖని ,శ్రీకాంత్, అంజలి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తూ ఉన్నారు.అయితే ఇప్పటికే పలు కీలక టెక్నీషియన్లు కారణంగా ప్రాజెక్టు విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉంటే.. ఇప్పుడు లీకులు మాత్రం ఆ ప్రాజెక్టుని ప్రారంభం నుంచి వెంటాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని కీలకమైన షెడ్యూల్ ని రాజమండ్రి అమృతసర్ లో పూర్తి చేశారు రాజమండ్రిలో రాంచరణ్ పై రూపొందించిన పలు సన్నివేశాలు రామ్ చరణ్ సైకిల్ పైన వెళ్తున్న సన్నివేశాలకు సంబంధించి వీడియోలు నెట్టింట లీకై వైరల్ గా మారాయి.ఆ తరువాత పలు ఫోటోలు కూడా లీక్ కావడం చిత్ర బృందం లీకుల పైన యాక్షన్ తీసుకుంటానని చెప్పడం వంటివి జరిగాయి. అయినా సరే ఈ సినిమాకు సంబంధించి లీకులు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నట్లుగా సమాచారం.తాజాగా ఒక సాంగ్ షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్ తో పాటు ఆడియో కూడా లీక్ అవ్వడంతో కొంతమంది అభిమానులు సైతం మండిపడుతూ ఉన్నారు. ఇకనుంచైనా లీకులు కాకుండా జాగ్రత్తగా వహించాలని దిల్ రాజ్ కు సూచనలు కూడా ఇస్తున్నారు. అయితే ఇలాంటి లీకుల వెనక తప్పే ఎవరిది అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది. దిల్ రాజ్ దా.. శంకర్ దా అనే విషయాన్ని నెటిజన్లు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: