దర్శకుడిగా చందు మొండేటి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించే సినిమాలు చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ2 సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు ఈ దర్శకుడు. అంతకుముందు ప్రేక్షకులను నిరాశపరిచిన కూడా కాన్సెప్ట్ పరంగా అందరిని ఎంత గానో ఆకట్టుకునే ఈ దర్శకుడు ఇప్పుడు ఎంతటి పెద్ద విజయాన్ని అందుకోవాలని నిజంగా ఆయనకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది అనడానికి నిదర్శనం.

 ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అద్భుతమైన కథను రెడీ చేసి త్వరలోనే ఒక పెద్ద హీరోకి వినిపించాలనీ రెడీ అవుతున్నారట. కార్తికేయ రెండవ  భాగం సినిమా లో ఆ చిత్రానికి సీక్వెల్ ఉందని హింట్ ఇచ్చిన చందు మొండేటి ఆ సినిమాను రూపొందించడానికి కంటే ముందుగానే ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నారు. దాంతో ఆ చిత్రం ఎప్పుడు మొదలుపెట్టాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు 

తాజాగా ఒక మాస్ కథని ఓ అగ్ర హీరోకి వినిపించిన చందు మొండేటి ఆయన వేసిన ఇవ్వడం కోసం ఎదురు చూస్తున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. కాబట్టి ఈయన కథను ఓకే చేయడానికి ఏ హీరో కూడా పెద్దగా సమయాన్ని తీసుకోకపోవచ్చు. ఆ విధంగా తొందర గా ఆయన పెద్ద హీరోతో సినిమాను మొదలు పెట్టి ఆ తర్వాత కార్తికేయ తదుపరి భాగాన్ని రూపొందించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో దీనిపై స్పష్ట త వచ్చే అవకాశం ఉంది. స్వామీ రారా సినిమా తో ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచమైన చందు మొండేటి తొలి సినిమా తో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు.. ఆ తర్వాత ప్రేమ మ్, కార్తికేయ వంటి సినిమాలతో ఈ దర్శకుడు మంచి విజయాలను అందుకుని మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: