అర్జున్
రెడ్డి సినిమాతో ప్రేక్షకులకు దర్శకుడుగా పరిచయమై భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు
సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే ట్రెండ్ మార్చేసే సినిమాకు దర్శకత్వం వహించడం అంటే అంత మామూలు విషయం కాదు. అలాంటి అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు ఈ దర్శకుడు
సందీప్ రెడ్డి. ఆ విధంగా ఆయన ఇంతటి భారీ విజయాన్ని అందుకొని
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అదే సినిమాలో
రీమేక్ చేసి అక్కడ కూడా దాని ద్వారా సంచలన విజయాన్ని అందుకున్నాడు.
ఆ విధంగా
సందీప్ రెడ్డి వంగా
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడు గా ఇప్పుడు అక్కడ మరో సినిమాలో చేస్తున్నాడు.
రణబీర్ కపూర్ హీరోగా ఆయన యానిమల్ అనే ఓ చిత్రాన్ని అక్కడ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రాన్ని పూర్తి చేసి త్వరలోనే తెలుగులో సినిమాను మొదలు పెట్టే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. కారణం ఏంటో తెలియదు కానీ తెలుగులో అంతమంది అగ్ర హీరోలు ఉన్నా కూడా వారందరినీ కాదని
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయడం ఆయన అభిమానులను కొంత నిరాశ పరిచింది. ఇకపోతే ఇప్పుడు తెలుగులో ఆయన వరుస సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
ఇప్పటికే
ప్రభాస్ హీరోగా కొన్ని సినిమాలను మొదలుపెట్టిన ఈ దర్శకుడు తొందర్లోనే మరి కొంతమంది తెలుగు హీరోలతో సినిమాలు చేసే విధంగా సిద్ధమవుతున్నాడు.
ప్రభాస్ తర్వాత
విజయ్ దేవరకొండ తో ఆయన తన తదుపరి
సినిమా చేయబోతున్నాడని వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపి స్తున్నాయి. త్వరలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. మరి ఇప్పటిదాకా ఒక
అర్జున్ రెడ్డి సినిమాతోనే తన కెరియర్ను నెట్టుకు వచ్చిన
సందీప్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న తదుపరి సినిమాతో విజయాన్ని అందుకుని తనకు సాటి ఎవరూ లేదని మరొకసారి నిరూపించుకుంటాడా అనేది చూడాలి.