టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయిన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొంత కాలం క్రితం విడుదల అయిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. కార్తికేయ 2 మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి ,  వైవా హర్ష ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు.

ఇది ఇలా ఉంటే కార్తికేయ మూవీ కి సీక్వల్ గా తిరక్కెక్కిన మూవీ కావడంతో కార్తికేయ 2 మూవీ పై మొదటి నుండే తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఆగస్టు 13 వ తేదీన విడుదల అయిన కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించి అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది.

మూవీ సౌత్ తో పాటు నార్త్ లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టిం.ది ప్రస్తుతం కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న కార్తికేయ 2 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి జీ 5 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: