టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో నటించి అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక అదిరి పోయే క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ లో హీరోగా నటించాడు .

మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా , పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఆగస్టు 25 వ తేదీన విడుదల అయిన లైగర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర గోరపరాజయాన్ని అందుకుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , శివ నర్వనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షేర వేగంగా జరుగుతుంది.

మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఖుషి మూవీ తర్వాత విజయ్ దేవరకొండ , సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించే అవకాశం ఉంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: