ఇటీవల కాలంలో ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆసక్తి పరిచిన
సినిమా బ్రహ్మాస్త్ర.
రణబీర్ కపూర్ మరియు
ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్,
నాగార్జున కీలక పాత్రలలో నటించగా అంగరంగ వైభవంగా ఈ
సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్
హీరో కాన్సెప్ట్ తో ఈ
సినిమా నిన్న విడుదల అయ్యి ఒక వర్గం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది అని చెప్పాలి. భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చిన ఈ
సినిమా అనుకున్నంత విజయం సాధించలేదని కొంతమంది చెప్పుకుంటున్నారు.
కారణం ఏదైనా ప్రతి
బాలీవుడ్ సినిమా లాగానే ఈ సినిమాని కూడా ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా నిర్మాతలు చేయలేకపోయారు. ఫలితంగా బ్రహ్మస్త్ర
సినిమా యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇక తెలుగు విషయానికి వస్తే ఈ సినిమాకు మొదటి నుంచి ముందుండి ప్రచారం చేయసాగాడు రాజమౌళి.
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన సినిమాలకు హెల్ప్ చేసిన సంస్థ అయిన
ధర్మ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన
సినిమా కావడంతో ఈ
సినిమా కోసం ఆయన ప్రచారం చేయసాగారు. ఫ్రీ రిలీజ్
ఈవెంట్ దగ్గర నుంచి ఇంటర్వ్యూల దాకా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఈ సినిమాకి ప్రచారం చేసి
సినిమా పట్ల ఆసక్తిని వచ్చేలా చేయగలిగాడు.
కానీ కంటెంట్ ప్రేక్షకులందరికీ నచ్చకపోవడంతో ఈ
సినిమా హిట్ అవ్వడానికి ఆయన చేయి వేసిన కూడా అది వర్కౌట్ అవలేదని చెప్పాలి. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ
సినిమా తొలి భాగం ఈ విధంగా అవడం తర్వాతి రెండు భాగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఆ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. మరి తొలిభాగంతో మోస్తరుగానే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్రహ్మాస్త్ర
సినిమా తర్వాత రెండు భాగాలతోనైనా అందరినీ అలరిస్తుందా అనేది చూడాలి. మొదటినుంచి ఈ
సినిమా విడుదలకు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్
ఈవెంట్ కూడా మధ్యలోనే క్యాన్సల్ అయిపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి.