అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ఆచితూచి తన సినిమాల ఎంపిక చేసుకుంటున్నాడు. అందుకే పుష్ప సినిమా కంటే ముందుగా ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసి ఫ్రెష్ గా తనకు పెరిగిన ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. అందుకే పుష్ప సినిమా కంటే ముందుగానే ఒప్పుకున్న ఐకాన్ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తదుపరి సినిమాను చేయనున్నాడు. 

ప్రస్తుతం పుష్ప రెండవ భాగం సినిమా పైనే పూర్తి దృష్టి సారించిన అల్లు అర్జున్ ఆ తర్వాత పలు బాలీవుడ్ దర్శకులతో కలిసి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొదటి భాగం సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు చేస్తున్న ఈ రెండవ భాగం అంతకుమించిన విజయాన్ని అందుకోవాలని ఎక్కువ భాగం సమయాన్ని స్క్రిప్ట్ కోసమే తీసుకుంటున్నాడు అల్లు అర్జున్. తన మేకోవర్ విషయమై కూడా ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంటూ ఈ సినిమా బాగా తెరకెక్కే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.  

ఆ విధంగా అల్లు అర్జున్ వదిలేసిన ఈ ఐకాన్ ప్రాజెక్టును చరణ్ చేస్తున్నాడు అన్న వార్తలు రావడం కొంతమందిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. వేణు శ్రీరామ్ ఎప్పుడు ఈ సినిమాను అల్లు అర్జున్తో చేయాలని భావించి ఆయనకు కథ చెప్పి ఓపించి సినిమాను కూడా కలవదు చేశాడు కానీ చివరి నిమిషంలో దానిని అల్లు అర్జున్ క్యాన్సిల్ చేశాడు. అయితే ఇద్దరు కూడా ఫ్యాన్ ఇండియా హీరోలే కాబట్టి ఆ స్థాయిలోనే సినిమాలను చేయాలని వారి కోరిక ముఖ్యంగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలతో వచ్చిన గుర్తింపును రెట్టింపు చేసుకునే విధంగా పెద్ద దర్శకులతో సినిమాల్లో చేస్తూ పోతుంటే ఈ ఐకాన్ సినిమాని మాత్రం ఓకే చేయడం కొంతమంది మీద అభిమానులను ఏమాత్రం మెప్పించడం లేదు. ఇందులో ఎంతవరకు నిజముదో తెలియదు కానీ మెగా పవర్ స్టార్సినిమా చేస్తే బాగుంటుంది అన్నది మరి కొంతమంది ఆలోచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: