టాలీవుడ్
సినిమా పరిశ్రమలో కెరటంలా దూసుకు వచ్చి అగ్ర హీరోగా నిలదొక్కుకున్నాడు
విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు
సినిమా ద్వారా సాధారణ హీరోగా
సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన
విజయ్ దేవరకొండ అర్జున్
రెడ్డి సినిమాతో తన సత్తాను చాటి అగ్ర హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత చేసిన గీతా గోవిందం టాక్సీవాలా చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఆయన నెంబర్ వన్ హీరోకి పోటీగా తన వంతు కృషి చేశాడు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించకపోవడంతో కాస్త వెనుకబడి ఉన్నాడని చెప్పాలి.
దానికి తోడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్
సినిమా కూడా ఏమాత్రం ప్రేక్షకులను అలచకపోవడంతో ఆయన క్రేజ్ కొంత తగ్గినట్లు అయ్యింది. అయితే అనూహ్యంగా సినిమాలు ప్లాప్ అవుతున్న కూడా
విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గిపోలేదు అని చెప్పడానికి నిదర్శనం ఆయన ఇప్పుడు చేస్తున్న యాడ్స్. భారీ అంచనాల నడుమ విడుదలైన
సినిమా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో దాని ప్రభావం తప్పకుండా ఆయన యాడ్స్ పై పడుతుందని ప్రతి ఒక్కరు కూడా భావించారు కానీ ఆ యాడ్స్ ఇంకా పెరగడం ఆయనకు క్రేజీ ఏమాత్రం తగ్గలేదు అనడానికి నిదర్శనం.
మరి విజయం సాధిస్తే ఆయనకు ఇంకా ఎన్ని యాడ్స్ పెరుగుతాయో చూడాలి. ప్రస్తుతం ఆయన హీరోగా
ఖుషి సినిమా రూపొందుతుంది.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో
సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండగా
శివ నిర్మాణ దర్శకత్వం అందిస్తూ ఉండడం విశేషం. ఈ
సినిమా తరువాత
మాస్ దర్శకుడు
హరీష్ శంకర్ తో కలిసి ఆయన
సినిమా చేయబోతున్నాడు అని చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. ఇక
సుకుమార్ దర్శకత్వంలో కూడా ఆయన త్వరలో ఓ
సినిమా చేయబోతున్నాడు. మరి ఈ సినిమాల ద్వారా ఆయన అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నా ఒక ఘనవిజయం అందుతుందా అనేది చూడాలి.